యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతన ఫిట్నెస్ స్టేషన్ ప్రారంభం – DTO సంగెం నరేష్ వెల్లడి…

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 5/
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని రకాల వాణిజ్య (కమర్షియల్) వాహనాల సామర్థ్య పరీక్షల (ఫిట్నెస్‌ టెస్టులు) నిర్వహణపై జిల్లా రవాణా శాఖాధికారి (DTO) సంగెం నరేష్ ఒక ముఖ్య ప్రకటన విడుదల చేశారు. చౌటుప్పల్ మండలం, మల్కాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ స్టేషన్‌లో ఆగస్టు 17వ తేదీ నుండి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
​వాహనదారులు ఈ విషయాన్ని గమనించి, నిర్దేశిత తేదీ నుండి తమ కమర్షియల్ వాహనాల ఫిట్నెస్‌ టెస్టులను మల్కాపురం స్టేషన్‌లోనే చేయించుకోవాలని సూచించారు. ఈ నూతన సదుపాయాన్ని వినియోగించుకుంటూ, రవాణా శాఖకు జిల్లాలోని వాహనదారులందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని డీటీఓ సంగెం నరేష్ కోరారు.

📄 Generate e-Paper Clip
Share This Article