రాయల్ పోస్ట్ న్యూస్ చారకొండ , జూలై 16: చారకొండ మండలం జేపల్లి గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ లైన్ మెన్ మల్లెపాకుల శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివదేహాన్ని సందర్శించడానికి బుధ వారం పలువురు విద్యుత్ శాఖ ఉద్యోగులు, పలువురు రాజకీయ నాయకులు యువత, గ్రామ ప్రజ లు పెద్ద ఎత్తున తరలి వచ్చి నివా ళులు అర్పించి, కట్టతడిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని గుర్తుచేసుకొంటూ కన్నీటి పర్యంతం అయ్యా రు. గ్రామప్రజలు, పలువురు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. అంగరంగ వైభవంగా డబ్బు చప్పులతో ప్రజానీకం ఊరేగింపుగా కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో కుమారుడు వంశీ, ఆయన కుటుంబ సభ్యులు సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిపారు.
