ర్రాయల్ పోస్ట్ న్యూస్ న్యూస్, జూలై – 16/ తాజ్ పూర్ ను సందర్శించిన భువనగిరి విద్యుత్ శాఖ ADE అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ పి. రవీందర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ గారితో గ్రామానికి మంజూరైన 24గంటల నిరంతర విద్యుత్,మరియు పలు విద్యుత్ సమస్య ల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు తాజ్ పూర్ గ్రామంలో తిరిగి లో పలు విద్యుత్ సమస్య లను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి మంజూరైనా 24 గంటల నిరంతర విద్యుత్ కు సంబందించిన పనులను పరిశీలించారు. అదేవిధంగా 3,4 ముస్లిం కాలనీ వార్డుల్లో కొత్త విద్యుత్ లైన్ మరియు గ్రామంలో అవసరమైన చోట కొత్త స్థంబాలు వీలైనంత తొందరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరియు కొత్త గా మంజూరు అయిన రెండు ట్రాన్స్ఫర్మర్ లను ఏర్పాటు చేయడానికి కావలిసిన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు తాజ్ పూర్ గ్రామానికి ఏ విధమైన విద్యుత్ సమస్య లు లేకుండా మేము సహకరిస్తామని ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో వారి వెంట సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్ రావ్, బీబీనగర్ లైన్ మెన్ ఆర్. బాలనర్సింహా, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
