రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 26/ ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 22వ వార్డు పరిధిలోని ఇందిరానగర్ మరియు పోచమ్మవాడ లో పారిశుధ్య పనులు చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించి ఫాగింగ్ చేయించడం జరిగింది. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదని, మునిసిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు మురిజి కాలువలు, రోడ్లు శుభ్రపరుస్తున్నారని ఏమైనా సమస్య ఉంటె ట్ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో పారిశుధ్యానికి సంబంధించి కొత్త వాహనాలకు ఇతర సామాగ్రికి కూడా నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చల్ల కిషోర్, వార్డు ఆఫీసరు రాము, భూషపక మనీష్, కోళ్ల ప్రవీణ్, పడిగెల మని, బర్రె వరుణ్, దినేష్, జవాన్ శ్రీధర్ మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
