ప్రభుత్వం తొలి దశ మరియు మలిదశ ఉద్యమకారులను గుర్తించి గౌరవించాలి…తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు పూస శ్రీనివాస్

తొలి దశ యమకారుడు సీనియర్ న్యాయవాది పులిమామిడి బాలకృష్ణ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ సహాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి చల్లగురుగుల రఘుబాబు చేత ఘన సన్మానం.

పీడీ యాక్ట్ అనుభవించిన తొలిదశ ఉద్యమకారుడు పులిమామిడి బాలకృష్ణారెడ్డి అడ్వకేట్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి.

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి మే 31/ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పూస శ్రీనివాస్ సహాధ్యక్షుడు కొడిమాల కృష్ణ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లగురుగుల రఘు బాబు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సంఘం ముఖ్యుల సమావేశంలో భాగంగా తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడైన పులిమామిడి బాలకృష్ణారెడ్డి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది . ఆనాటి ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి పిడి యాక్ట్ ను కూడా అనుభవించి మరియు మలిదశ ఉద్యమంలో కూడా ఎంతోమందికి ఉద్యమంలో భాగంగా నిర్వహించిన భువనగిరి సభ ద్వారా ఎంతోమందికి ఉద్యమకారుల స్ఫూర్తిని అందించి తెలంగాణ ఆకాంక్షను అందుకునే వరకు వివిధ రూపాలలో వారి ఉద్యమ సేవలను ఉద్యమకారులకు అందించి వారి ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారు అలాంటి మహోన్నత ఉద్యమకారులను ఈనాడు ప్రభుత్వం గుర్తించి గౌరవించాల్సిన బాధ్యతను విస్మరించకుండా తొలి మలిదశ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడంలో అలసత్వం ప్రదర్శించకుండా ఉద్యమకారులను గుర్తించి గౌరవించడం ప్రధాన కర్తవ్యం గా ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సహాధ్యక్షులు కొడిమాల కృష్ణ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్ల గురు గుల రఘు బాబు మరియు అనేక ఉద్యమకారులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *