రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 7/
యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం హనుమాపురం గ్రామంలో మేఘన హాస్పిటల్ భువనగిరి వారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు
గ్రామ సర్పంచ్ నాగపురి సువర్ణ కృష్ణ సహకారం తో , మేఘన హాస్పిటల్ చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ సి. శ్రావ్య భావన (MBBS, MS-OBG, మేఘన హాస్పిటల్ భువనగిరి ) డాక్టర్ కె. సుప్రజ బాయ్ DMO( PHARM-D ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హన్మాపురం గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వైద్య సేవలను విశేషంగా వినియోగించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మేఘన హాస్పిటల్ ఎం డి రామ్ రెడ్డి గ్రామ సర్పంచ్ సువర్ణ కృష్ణ మేఘన హాస్పిటల్ వైద్య సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని జయప్రదం చేశారు.