రాయల్ పోస్ట్ న్యూస్ జులై 2/
భువనగిరి: భువనగిరి నియోజకవర్గంలోని S.I.R (Survey, Identification & Registration) ప్రక్రియపై గ్రామస్థులలో సరైన సమాచారం లేనందున తీవ్ర ఇబ్బందులు ఉన్నట్లు నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం బయాభాని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం ద్వారా తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు నిరక్ష్యరాస్యులు దరఖాస్తు ఫారంలను ఎలా నింపాలనే సామర్థ్యం లేక దరఖాస్తు సమర్పణలో గందరగోలం గా ఉందన్నారు.
గ్రామాలకు సరైన సమాచారం ప్రసారం చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు .
దరఖాస్తు ఫారంలను తప్పులేని విధంగా పూర్ణంగా నింపే మార్గదర్శకత్వం అందకుండానే సమస్య కష్టతరంగా మారింది.
జిల్లా యంత్రాంగం నియమించిన బిఎల్వోలు (BLO) తమ బాధ్యతా పరిధిలో ఉండి, బిఎల్ఎలతో (BLA) కలిసి ఓటర్ల వద్దకి (door-to-door) వెల్లి S.I.R ఫారంలను సరిగా నింపించాలి మరియు సబ్మిట్ చేయడంలో ప్రత్యక్షంగా సహకారం అందించాలి అని
మహమ్మద్ ఇబ్రహీం తమ వినతిలో అభ్యర్థించారు:
బిఎల్వోలు, బిఎల్ఎలకు ప్రత్యేక సూచనలు జారీ చేసి, బాధ్యాస్థులైన గ్రామాలలో ప్రత్యేక అవగాహనా శిబిరాలు నిర్వహించాలని.
ఫారమ్ బోధన, నమోదు పద్ధతులు, తప్పుల నివారణపై స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ లక్ష్యాన్ని విజయవంతం చేయాల్సి ఉందని,
వృద్ధులు, మహిళలు, నిరక్ష్యరాస్యుల వంటి సున్నిత వర్గాల కోసం ప్రత్యేక సహాయ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ
మొదలైన ప్రక్రియ సక్రమంగా జరగకపోతే గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు తప్పు కారణంగా తిరస్కరించబడే ప్రమాదం ఉందని వినతి పత్రం ద్వారా ఎమ్మెల్యే కి తెలిపారు . స్థానికుల కోసం వెంటనే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ బిఎల్వోలు-బిఎల్ఎల సమన్వయంతో దరఖాస్తుల పూర్తి చేయడంలో సహాయం అందించాలనీ మహమ్మద్ ఇబ్రహీం బియాబాని తెలిపారు .
ఈ విషయంలో ఎమ్మెల్యే కార్యాలయం నుండి కూడా తగిన చర్య తీసుకోవాలని, జిల్లా ఎన్నికల యంత్రాంగం మరియు గ్రామ సచివాలయాలతో సంప్రదించి వెంటనే అవగాహనా శిబిరాలు ఏర్పాటు చేయాలని మొహమ్మద్ ఇబ్రహీం బియబాని కోరారు