రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 24/ - భువనగిరి జిల్లా కేంద్రంలోని చౌక్ మజీద్ ముందు బారా ఇమామ్ అసూర్ ఖాన్ లో మొహరం సందర్భంగా మతసామరస్యం పెంపొందింస్తూ, శాంతి సామరస్యం ప్రజలలో విశ్వాసం నమ్మకం అని భువనగిరి ప్రాంతం లో గాని దేశంలో గాని హిందూ, ముస్లిం మతాలను సమానంగా భావిస్తూ ప్రజలంతా ఈ మొహరం పండుగను కలిసికట్టుగా జరుపుకుంటారని దీనివలన ముస్లిం, హిందూ ప్రజలంతా కూడా కలిసిమెలిసి సేవాభావంతో ఉంటారని బర్రె జహంగీర్ గారు అన్నారు బారా ఇమామ్ అసూర్ ఖాన్ లో దట్టి కట్టే భాగ్యం కూడా లభించడం నాకు సంతోషమని ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా మొహరం పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషం వ్యక్తపరిచారు ఈ మొహరం పండుగ అనేది ఒక సాంస్కృతి అని సాంప్రదాయమని ప్రతి సంవత్సరం కూడా భువనగిరి పట్టణంలో పీర్లను వీధిలో గుండా ప్రధానం మార్గాల ద్వారా ఊరేగించడం అందులో ప్రజలంతా మమేకమై ఆ ఆనందంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్నేహభావాన్ని వ్యక్తపరచడం భువనగిరి ప్రజలు చేసుకున్న ఒక శుభ పరిణామమని ఇది ఇది ఇలాగే గత ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయమని వివరించారు ఆయన వెంట మాజీ కౌన్సిలర్ ఈరపాక నరసింహ, హీరేకార్ శ్రీనివాస్, పిట్టల బాలరాజ్, కాల్యా నాగరాజ్, బోయిని బాలయ్య, ఎండి మసూద్, భూషపాక ఈశ్వర్ బాబు, బర్రె క్రాంతి తదితరులు పాల్గొన్నారు.