రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 3/ పేద ప్రజలను మోసం చేసే పార్టీ బి.ఆర్.ఎస్ : కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ఈరోజు బి .ఆర్.ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేయడం సిగ్గు చేటని, గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సోయి సోంపు లేక పేద ప్రజలను మోసం చేసి ఈరోజు ఏమి ఎరుగని అమాయకుల్లా ఆందోళన చేస్తున్నారని, వాళ్ళు అసంపూర్తిగా వదిలేసిన ఇండ్లను గౌరవ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి సుమారు 3 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేయిస్తున్నారని, ప్రతిరోజు అధికారులతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెస్తూ దాదాపు పనులు పూర్తయ్యేల చేశారని, తొందర్లోనే లబ్దిదారులకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇకనైనా బుద్ది తెచ్చుకుని ప్రజలను మోసం చేసే పనులు మానుకోవాలని అన్నారు.