
మెదక్ జిల్లా, పాపన్నపేట,రాయల్ పోస్ట్ న్యూస్, మే 21
కుటుంబ కలహాలు సంతాన లేమితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చికోడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటింబికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.బోయిని పర్వయ్య, అనూషమ్మ లకు ఇరువురు కుమారులు కాగా పెద్ద కుమారుడు సంగమేశ్వర్, చిన్న కుమారుడు సాయిబాబా (32) లు కాగా ఇరువురి కుమారులకు వివాహాలు జరుపగా చిన్న కుమారుడు సాయిబాబా పని పాట చేయకుండా జులయిగా తిరిగుతూ సంసారం పట్టింపు లేకుండా తిరుగుతుండడం తో భార్య వాసవి తో తరచు గొడవలు చోటుచేసుకుంటుండమే కాక సంతానం లేక పోవడం మూలంగా గొడవలు జరుగు తుండేవి. బుధవారం భార్య భర్తల మధ్య గొడవ చేసుకోవడం తో మధ్యాహ్నం ఇంటిలోని గదిలోకి వెళ్ళి గడియ వేసుకోవడం తో అనుమానం వచ్చిన భార్య వాసవి, అత్త అను షమ్మ కు తెలుపడంతో ఇరువురు వెళ్ళి గడియ తీయాలని పిలిచినా పలుక కాపోవడంతో పెద్ద కుమారుడు సంగమేశ్వర్ సహాయం తో గడ్డపార తలుపులు సందు చేసుకొని చూడగా దూలనికి చీర తో ఊరి వేసుకొని ఉండడాన్ని గమనించి వెంటనే పాపన్న పేట పోలీసుల కు సమాచారం అదివ్వడం తో సమాచారం అందుకున్న పాపన్న పేట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పంచనామా నిర్వహించి. మృతుడి తల్లి అనూషమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యప్తు చేస్తున్నట్లు పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాగా మృతుడికి భార్య వాసవి, తల్లి అను షమ్మ ఉన్నారు.