రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం ఆగస్టు 03:)

ఇబ్రహీంపట్నం నుండి ఆకులమైలారం వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సులను కోలన్గూడ గ్రామం మీదుగా నడపాలని కోరుతూ కోలన్గూడ సర్పంచ్ గోరికెల బీరప్ప,రాసూరి కరణ్లు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కోలన్గూడ గ్రామం మీదుగా బస్సులు నడపడం వల్ల గ్రామ ప్రజలు,విద్యార్థులు,ఉద్యోగులు,వృద్ధులు ప్రయాణ సౌకర్యం పొందుతారని,ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని వారు కోరారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అన్ని బస్సులను కోలన్గూడ మీదుగా నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేశారు