రాయల్ పోస్ట్ న్యూస్ జులై 1/ యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ గారు గుండాల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా స్టేషన్ జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ రిజిస్టర్లు, నేరాల రికార్డులు, ఆస్తుల రిజిస్టర్లు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, స్టేషన్ పరిపాలనా విధానాలను సమీక్షించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్ కేసులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్, లాక్అప్, బ్యారక్స్, సీసీటీవీ వ్యవస్థ, పరిశుభ్రతను పరిశీలించి, స్టేషన్ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజా స్నేహపూర్వక పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి పహారా నిర్వహణ, మాదకద్రవ్యాల నిర్మూలన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సూచించారు.
ఈ తనిఖీలో యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్, గుండాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శోభన్ బాబు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

