రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 20/ 31వ వార్డు బంజారాహిల్స్ ప్రాంతంలో తక్కువ వాట్స్తో వెలుగుతున్న మరియు మసకబారిన కాంతిని ఇస్తున్న వీధి దీపాలను అధిక సామర్థ్యం కలిగిన వీధి దీపాలతో మార్చాలని మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి 31వ వార్డు కౌన్సిలర్ సుమయ్య తబస్సుం షఫీక్ అహ్మద్ వినతి పత్రం సమర్పించారు.

వార్డులోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఏర్పాటు చేసిన వీధి దీపాలు తక్కువ వాట్స్ కలిగి ఉండటంతో రాత్రి సమయంలో సరైన వెలుతురు అందడం లేదని ఆమె తెలిపారు. దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు మరియు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అందువల్ల తక్కువ వాట్స్ కలిగిన వీధి దీపాలను తొలగించి, అధిక వెలుతురు ఇచ్చే కొత్త ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు సమస్యను సానుకూలంగా స్వీకరించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.