ఆషాఢ బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్..

Fasiuddin Mohammed
0 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ ఘట్కేసర్ ఆగస్ట్ 9/ మేడ్చల్–మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ కీసర,దమ్మైగూడ డివిజన్లలో ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రెష్ యాదవ్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article