రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 26: రేషన్ డీలర్ అసోసియేషన్ నగర నాయకులు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మంత్రి రవీంద్ర కుమార్ ( 65) ఆదివారం తిలక్ నగర్ లో గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు భార్య కుమార్తె ఉంది. రవీంద్ర కుమార్ మృతి పట్ల మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్ తో పాటు పలువురు ఆయన పార్తివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంతాపం ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు.
