రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్
జులై 26/ హైదరాబాద్ లో భాగలింగంపల్లి లోని పుచ్చల పల్లి సుందరయ్య విగ్యాన కేంద్రం హాల్ లో ఆదివారం రోజున
బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ జాతీయ వెస్ట్రన్ ఇండియా కాన్ఫరెన్స్ సదస్సుకు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా హైదరాబాదు జిల్లా జామయి ఉస్మానియా బౌద్దా నగర్ కు చెందిన బి. అనన్య రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా నాట్యరంగంలో ఉత్తమ ప్రదర్శన చేస్తూ నాట్య రంగానికి సేవ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో వారిని గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ వారు జాతీయ నాట్య రత్న అవార్డు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

