రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 18/ భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 23వ వార్డు బ్రాహ్మణవాడ కీ చెందిన గోగు నరేష్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ బర్రె పూజిత- బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ లు శనివారం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి వారి పార్థివ దేహాన్ని పూలమాలలు వేసి ప్రగడ సానుభూతి తెలిపారు. ఈసందర్భంగా వార్డు ప్రజలకు మేము ఎల్లప్పుడూ అండగా ఎల్లవేళల ఉంటామని బరోసా కల్పించారు. అన్న వెంట వార్డ్ పెద్దలు హరికిషన్ బండారు రవివర్ధన్, ఉడుత దుర్గా గౌడ్, పోకల నాగరాజు, జంగిటి వరుణ్ తేజ, కొల్పులకి, బర్రె క్రాంతి పాల్గొని నివాళులర్పించారు.
