రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 25/ అర్హులైన వారి ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని
జిల్లా కేంద్రంలోని భువనగిరి 94 శాసనసభ, భువనగిరి పట్టణ 23వ వార్డు పరిధిలోని 76వ పోలింగ్ బూత్లో గురువారం ప్రారంభమైన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ ఛైర్మెన్,BLA కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేయాలని, డబుల్ ఓట్లు, మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి తొలగించాలని బూత్ స్థాయి అధికారి (BLO)ను కోరారు.
వలస వెళ్లిన ఓటర్లను ఒకటికి రెండుసార్లు సంప్రదించి, అర్హులైన వారి ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సంఘం 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఓటర్లను గుర్తించే విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజలకు కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. కేవలం డబుల్ ఓట్లు, మరణించిన వారి పేర్లను తొలగించేందుకు ఇంత పెద్ద ఎత్తున సవరణ ప్రక్రియ చేపట్టడం అవసరమా అనే ప్రశ్నను లేవనెత్తారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నెల రోజుల పాటు బీఎల్ఓలతో కలిసి ఇంటింటికీ తిరిగి ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియలో ప్రజలకు సహకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BLO అనిల్ నాయక్, అంగన్వాడి ఇంచార్జ్ టీచర్ మేడి భారతి, నాయకులు బండారు రవివర్ధన్ రిటైర్డ్ ఎంఈఓ, వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపి బాబు, ఆర్ పి మంజుల పాల్గొన్నారు.

