royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaవిద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం టిఎక్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 10:51 pm
Date of Publish : 11 Sep 2026, 7:22 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 3 💬 0
Latest News

విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం టిఎక్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం…..

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి సెప్టెంబర్ 10/
కరెంట్ ఆఫీస్ ఆవరణలో టిఎక్స్ (TX) హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్థానిక డిఈ (DE) గారి ప్రత్యేక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.

ఉచితంగా పలు రకాల వైద్య పరీక్షలు
ఈ శిబిరంలో ఉద్యోగుల నుంచి రక్త నమూనాలను సేకరించడంతో పాటు 2D ఎకో, బీపీ, షుగర్ తదితర కీలక పరీక్షలను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆరోగ్య సమస్యలు గుర్తించిన వారికి తగిన వైద్య సలహాలు అందజేశారు.

ఈహెచ్‌ఎస్ (EHS) ఇన్సూరెన్స్ సౌకర్యం
ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ... ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు మెరుగైన చికిత్స కోసం తమ టిఎక్స్ హాస్పిటల్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. తమ ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం EHS ఇన్సూరెన్స్ తో పాటు అన్ని ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

పాల్గొన్న ముఖ్యులు
ఈ కార్యక్రమంలో టిఎక్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ నవీన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్, జనరల్ మేనేజర్ బాలకృష్ణ, విద్యుత్ శాఖ అధికారులు, హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.