వలిగొండ, ఆగస్టు 21 రాయల్ పోస్ట్ న్యూస్,/
మండలంలోని మొగిలిపాక ఎస్సీ కాలానీలో మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రజారోగ్య పరిరక్షణకు సామాజిక బాధ్యతగా అదే గ్రామానికి చెందిన మాజీ మత్స్యగిరి గుట్ట చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ముద్దసాని కిరణ్ రెడ్డి సౌజన్యంతో స్వంత నిధులు వెచ్చించి వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేసి శుక్రవారం ప్రారంభించారు. ఈ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసిన ముద్దసాని కిరణ్ రెడ్డికి కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ జడిగే బుచ్చయ్య, ఉప సర్పంచ్ షైక్ సైదులు, భీమానబోయిన బిక్షపతి, జక్కుల శంకరయ్య, మొగిలిపాక రమేష్, విష్ణుచారి, భీమానబోయిన నర్సింహా, ఆవిశెట్టి శ్రీను, జడిగే మల్లయ్య, సింగం మహేష్, జడిగే గోపాల్, పబ్బు సత్తయ్య, మద్ది పాండు రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.