royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaస్వర్ణగిరిలో శోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం.. కన్నులపండువగా నిత్య కళ్యాణోత్సవం… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 18 Sep 2026, 2:45 am
Date of Publish : 01 Aug 2026, 1:36 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 49 💬 0
Latest News

స్వర్ణగిరిలో శోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం.. కన్నులపండువగా నిత్య కళ్యాణోత్సవం…

స్వర్ణగిరిలో శోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం.. కన్నులపండువగా నిత్య కళ్యాణోత్సవం…

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగష్టు 1 స్వర్ణగిరి దివ్యక్షేత్రం:
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో శనివారం నాడు ఆషాఢ మాస కృష్ణ పక్ష తదియ సందర్భంగా స్వామివారి సేవలన్నీ అత్యంత వైభవంగా జరిగాయి. ప్రాతఃకాలంలో అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించి, అనంతరం మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుదీరిన గోపృష్ట దర్శనాన్ని భక్తులకు కల్పించారు.
​ఉదయం 5:45 గంటలకు అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణల నడుమ బంగారుబావి నుండి సువర్ణ బిందె తీర్థాన్ని తీసుకొచ్చి స్వామివారికి నిత్యారాధన గావించారు. ఉదయం 6 గంటలకు మేళతాళాలు, మృదంగ మంగళ ధ్వనుల మధ్య స్వామివారికి సుగంధ భరిత పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు.
​విశేష పూజలు – వసంతోత్సవం:
​సహస్ర నామార్చన: ఉదయం 7 గంటలకు స్వామివారిని మణిమయ స్వర్ణాభరణాలు, పరిమళభరిత పుష్పమాలలతో అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.
​సుదర్శన నారసింహ హవనం: లోక కళ్యాణం కాంక్షిస్తూ దివ్యక్షేత్రంలో అర్చక స్వాములు ఈ హవనాన్ని పూర్తి చేశారు.
​వసంతోత్సవ సేవ: అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పంచామృతం, పసుపు, సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రాల నడుమ వసంతోత్సవ సేవను శోభాయమానంగా నిర్వహించి, కర్పూర హారతులు ఇచ్చారు.
​అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణోత్సవం:
​ఉదయం 10:30 గంటలకు స్వామివారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, వైభవోత్సవ మండపంలో నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ ధ్వనులు, వేదమంత్రాల మధ్య జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తులు ఆనంద పరవశులయ్యారు.
​తిరువీధి ఉత్సవం & జల నారాయణ స్వామి హారతులు:
​సాయంత్రం 6:30 గంటలకు మాడవీధులలో శ్రీ స్వామివారిని శోభాయమానంగా ఊరేగిస్తూ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాల మధ్య ఊరేగిన అనంతరం, దేదీప్యమానమైన సహస్రదీప కాంతుల మధ్య స్వామివారు ఊయల సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం పవిత్ర సందర్భంగా జల నారాయణ స్వామి వారికి విశేషంగా మంగళహారతులు సమర్పించారు.
​అన్నప్రసాద వితరణ:
స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో నిర్వహించిన నిత్యాన్న ప్రసాద వితరణలో భాగంగా శనివారం సుమారు 5,000 మందికి పైగా భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.