రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ప్రతినిధి:రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ప్రతిష్టాత్మకంగా ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కోలాహలం నెలకొంది. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ , మున్సిపల్ చైర్మన్ తంగళ్పెల్లి వాణి రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను జమ చేయడాన్ని హర్షిస్తూ రైతు వేదికలో సంబరాలు జరిగారు.
ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ రైతు భరోసా నిధులు రైతులకు పెట్టుబడి సహాయంగా ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ సంబరాలలో స్థానిక ఆర్డీఓ (RDO) , జిల్లా వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓ (MPDO) దీనకర్, ఆయా , మల్లేష్ , వార్డ్ కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్ కుమార్తో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమకు సకాలంలో పెట్టుబడి సాయం అందుతుండటం పట్ల ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు.