రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి,జూన్ 24/
మొహర్రం సందర్బంగా భువనగిరి,పట్టణం లోని ఖాజిమహేల్లా లో ఉన్న బీబీకా ఆలం ను శియా అసోసియేషన్ సభ్యులతో కలిసి సందర్శించి..పూల చాదర్ మరియు,దట్టి ను సమర్పించిన యాదాద్రి భువనగిరి జిల్లా వక్ఫ్ బోర్డు ప్రొటెక్షన్ కమెటీ,అధ్యక్షులు ఎండీ ఇంతియాజ్ అహ్మద్ ప్రధాన కార్యదర్శి ఎండీ ఇస్తియాక్ అహ్మద్ ఈ సందర్బంగా ఇంతియాజ్ మాట్లాడుతూ,కర్బల మైదానం లో ఇమామ్,హసన్ హుస్సేన్ బలిదానానికి ప్రతీకగా మొహర్రం ను నిర్వహిస్తారని అన్నారు.ఇస్లాంను ప్రపంచానికి వ్యాప్తింప చేసే సమయం లో హజరత్ మొహమ్మద్ ముస్తఫా,సల్లేల్లాహు అలై హువ సల్లం మనవళ్ళు,కర్బలా మైదానం లో యుద్ధం,జరిగే సమయంలో హసన్ హుస్సేన్ బలి అయ్యారని,వారితో పాటు వారి కుటుంబాన్ని సైతం హత మార్చారని,అన్నారు. హసన్ హుస్సేన్ వారి కుటుంబాన్ని షహీద్ లుగా పరిగనించారని తెలిపారు. వారి బలిదానాన్ని స్మరించుకుంటూ శియా ముస్లిం లు,మాతం నిర్వహిస్తూ తమ రక్తాన్ని చిందిస్తారని తెలిపారు.అదే విధంగా ప్రపంచ మానవాళికి మార్గదర్శకులు ఇమామ్ కుటుంబం అని అన్నారు. ఈరోజు వాళ్ళ,కుటుంబ సభ్యుల బలిదానం వల్లనే ప్రపంచమంతా ఇస్లాం వ్యాప్తి చెందిందని తెలిపారు.అలాగే యాదాద్రి జిల్లా గ్రామ పంచాయతీ పరిధిలో ని పీర్ల కొట్టాల వద్ద,మరియు భువనగిరి మున్సిపల్ పరిధిలో పీర్ల కొట్టాల వద్ద,గురువారం జూన్ 25, మరియుశుక్రవారం 26,జూన్ రోజున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి,మొరం మట్టి తొ పాటు లైట్లు ఏర్పాటు చేయాలనీ అధికారులను కోరారు.అదే విధంగా మొహర్రం ఆశుర,శుక్రవారం
10,వ రోజున 26వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు, జంఖాన్ గూడా ఆశుర్ ఖానా నుండి మాతం ప్రదర్శన, మొదలుకొని బీబీ కా అలావా,వరకు కొనసాగు తుందని,మరియుసాయంత్రం హైదరాబాద్ చౌరస్తా,కర్బల నుండి,7 గంటలకు శియా ముస్లింలు,మాతం ప్రదర్శన ప్రారంభం అయ్యి ఖాజి మహేల్లా ఖాసీం దూల పీర్ల కొట్టం వరకు మాతం నిర్వహిస్తారని దానికి మున్సిపల్ అధికారులు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని మరియు మాతం కు పోలీసులు భద్రత కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమం లో,శియా ముస్లిం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రజా హుస్సేన్ ప్రధాన కార్యదర్శి కల్బె హుస్సేన్,ఉపాధ్యక్షులు మహేది హుస్సేన్,సయ్యద్ అద్నాన్ హుస్సేన్ సయ్యద్ అలీ హుస్సేన్ ఆబెది సయ్యద్ హైదర్ హుస్సేన్ ఆబెది సయ్యద్ మీసం
సయ్యద్ అలీ మొహమ్మద్
ఎండీ నాజిమ్,ఎండీ ఉస్మాన్, పల్లెర్ల కుమార్, సత్యం తదిత రులు పాల్గొన్నారు.