గజ్వేల్, 23 జూన్ 2026 (రాయల్ పోస్ట్ న్యూస్ ) :సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఒలింపిక్ డే సందర్భంగా క్రీడాకారులు, ప్రజల్లో క్రీడల పట్ల, ఆరోగ్యం, స్నేహభావం మరియు ఐకమత్యంపై అవగాహన కల్పించేందుకు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘2కే రన్’ ఘనంగా నిర్వహించారు. ఈ పరుగులో స్థానిక యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరోవైపు, యువతను పెడదోవ పట్టిస్తున్న వ్యసనాలపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, గజ్వేల్ సీఐ రవికుమార్ పర్యవేక్షణలో ‘డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం’ నిర్వహించారు. 2కే రన్నింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బిఆర్ఎస్ యువ నాయకుడు, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సి. సంతోష్ ఆధ్వర్యంలో అరటి పండ్లు, వాటర్ బాటిల్స్, పల్లిపట్టీలు పంపిణీ చేశారు. అనంతరం పరుగు పందెంలో మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు శాలువాలతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి హాజరయ్యారు. బాలబాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని రోజువారీ జీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒలింపిక్ డే సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.సి. సంతోష్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వాన్ని ఇస్తాయన్నారు. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షిస్తూ, నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు, మాజీ కౌన్సిలర్స్, వివిధ పార్టీల నాయకులు, యువజన విభాగాల భాధ్యులు నర్సింలు, వివిధ స్పోర్ట్స్ విభాగం బాధ్యులు, శివకుమార్, పిఈడి ఎలియాస్ రావు, పిఈటి నాగేష్, వాలీబాల్ రాజు, హరిచంద్ర, స్వామి, సంబంధిత సభ్యులు పాల్గొన్నారు.