యాదాద్రి(మే 29)వలిగొండ రాయల్ పోస్ట్ న్యూస్ : గర్భిణీ స్త్రీలు పౌష్టికర్శమైన ఆహారం తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ అధికారి వెంకటరమణ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని 6 వ అంగన్వాడి కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గర్భిణీలు బిడ్డల ఆరోగ్యం కొరకు పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలని,బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు పట్టించాలని,ఆరు మాసాలు నిండిన బిడ్డలకు బాలామృతం తినిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సూపరవైజర్ లు బాలమణి,ధనమ్మ,పారిజాత,భార్గవి, టీచర్లు,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.