Date of Publish : 22 May 2026, 5:20 pm | Posted by : FASIUDDIN MOHAMMED
👁 77💬 5
Latest News
వివోఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి… తెలంగాణ పంచాయతీరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ
( రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం మే 22:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో… మాణిక్యమ్మ గూడా సర్పంచ్, తెలంగాణ పంచాయతీరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ మాట్లాడుతూ…. వివోఏ లా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఐకెపి వివో ఎలా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు చేస్తున్న ధర్నాకు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా..సర్పంచ్, తెలంగాణ పంచాయతీరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ మాట్లాడుతూ… వివో ఎలా గౌరవ వేతనం ఉద్యోగ భద్రత పని భారం తగ్గించాలన్నారు కనీస వేతనం 20000 పెంచాలని డిమాండ్ చేశారు సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్సీ పాలసీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రత పని భారం తగ్గించాలని కోరారు వివో ఏ లకు సీసీ పదోన్నత కల్పించాలన్నారు 20 లక్షల ఆరోగ్య భీమా కల్పించాలని తెలిపారు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు ఈ ఈ కార్యక్రమంలో… వివో ఏలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొనడం జరిగింది