రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి మే 21/
యాదాద్రి భువనగిరి భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ను కలిసిన బీజేపీ ప్రతినిధులు వినతిపత్రం అందజేస్తూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఏర్పడిన తీవ్ర జాప్యం, కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాల లోపం మరియు 'తరుగు-తేమ' పేరుతో సాగుతున్న అన్యాయం గురించి ఆలేచి సమస్యల పరిష్కారాన్ని కోరారు.
కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి పరకల్పనాత్మక విధానంలో (యుద్ధ ప్రాతిపదికన) ధాన్య కొనుగోళ్లను త్వరగా చేపట్టి రైతులకు సకాలంలో చెల్లింపులు అందించవలెనని తెలిపారు . చెల్లింపులు ధాన్యం లిఫ్ట్ చేసిన వెంటనే, ఆలస్యం లేకుండా వారం రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాల్సినవసరాన్ని ఆయన గుర్తుచేశారు.
వెంటనే పోచంపల్లి ప్రాంతంలోని రైస్ మిల్లర్లపై వచ్చిన ఆరోపణలను తెలిపారు . అక్కడి మిల్లర్లు 300 బస్తాల ధాన్యం లిఫ్ట్ చేసినప్పటికీ 45 బస్తాలు తేమ తరుగు పేరిట కోతపెట్టుకుంటున్నట్లు రైతులు సమాచారం వచ్చినట్టు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కి అందజేస్తూ తక్షణమే DSO (డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్) ద్వారా పరిశీలించి, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, ఫిర్యాదులపై వెంటనే విచారణ కోరుతూ DSO ద్వారా వివరాలు తీసుకుని, విచారణలో ఏవైనా అవినీతిపరమైన చర్యలు కనపడితే తగిన చర్యలు తీసుకుంటామని, రైతులకు న్యాయం కల్పిస్తామని తెలిపారు .
ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయ దశరథ, తుమ్మల మురళీధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, చందా మహేందర్ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్ర శేఖర్, జిల్లా కార్యదర్శులు లక్ష్మీనారాయణ, కమిటీకారి కృష్ణ, తడిసిన మల్లారెడ్డి, వైజంతి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు మాధురి చంద్ర, ఆనంద్ గౌడ్, నరೇಶ್ మరియు ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
